Rajasthan: బట్టలు విప్పించి, తాడుతో కట్టేసి .. యువకుడిని చితక్కొట్టిన వైనం!

  • జైపూర్‌లో దారుణ ఘటన
  • చోరీలకు పాల్పడుతున్నాడని కొట్టిన వైనం
  • దృశ్యాలను స్మార్ట్‌ఫోన్‌లతో చిత్రీకరణ

రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక యువకులు కొందరు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఓ యువకుడిని దారుణంగా శిక్షించారు. ఆ యువ‌కుడు నిమ్స్ యూనివ‌ర్సిటీలో మొబైల్ ఫోన్లు, డ‌బ్బు చోరీ చేస్తున్నాడ‌ని ఆరోపిస్తూ అత‌డిని కొంత మంది యువ‌కులు ప‌ట్టుకున్నారు. అనంత‌రం అత‌డి బ‌ట్ట‌లు విప్పించి, క‌ట్టేసి కొట్టారు. త‌న‌ను వ‌దిలేయాల‌ని ఆ యువ‌కుడు ఎంత వేడుకున్నా వారు విన‌లేదు. కర్ర‌తో, తాడుతో అత‌డిని కొడుతూ ఆ దృశ్యాల‌ను త‌మ స్మార్ట్ ఫోన్ లో చిత్రీక‌రించారు. ఆ దృశ్యాలు మీడియాకు చిక్కాయి. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 

More Telugu News