nithin: 'తొలి ప్రేమ' హిట్ ఎఫెక్ట్ .. నితిన్ సరసన రాశీఖన్నాకు ఛాన్స్

  • దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కల్యాణం'
  • సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్
  • కథానాయికగా రాశీఖన్నా  

రాశీఖన్నా తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'తొలిప్రేమ' .. తొలి ఆటతోనే సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రాశీఖన్నాను మరో ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చినట్టుగా తెలుస్తోంది.

నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. కథ ప్రకారం 'శ్రీనివాస కల్యాణం' అనే టైటిల్ ను దీనికి ఖరారు చేశారు. ఈ సినిమా కోసం కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె స్థానంలో రాశీఖన్నాను తీసుకున్నారా? లేదంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.   

More Telugu News