ntr trust: ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి 21 సంవత్సరాలు .. సభ్యులందరికీ నా అభినందనలు: నారా లోకేశ్

  • ప్రజలకు సేవలందించడంలో ముందుకు సాగుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్
  • ‘సమాజమే దేవాలయం -  ప్రజలే దేవుళ్ళు’ అనేదే స్ఫూర్తి
  • ‘ప్రతిజ్ఞ ’పత్రాన్ని పోస్ట్ చేసిన నారా లోకేశ్

ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రజలకు సేవలందించడంలో ఎంతో కృషి, పట్టుదలతో ముందుకుసాగుతున్న ట్రస్ట్ సభ్యులందరికీ తన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ‘ప్రతిజ్ఞ ’పత్రాన్ని పోస్ట్ చేశారు. ‘సమాజమే దేవాలయం -  ప్రజలే దేవుళ్ళు’ అనే ఎన్టీఆర్ సేవా స్ఫూర్తిని లక్ష్యంగా తీసుకుంటూ, ఎన్టీఆర్ ట్రస్ట్ కుటుంబ సభ్యునిగా..నేను చేస్తున్న ప్రతిజ్ఞ ..నేను త్రికరణ శుద్ధితో నిరుపేదల, నిర్భాగ్యుల సేవకు అంకితం అవుతాను..’ అంటూ ప్రతిజ్ఞ  కొనసాగింది.

More Telugu News