Tirumala: అలిపిరి వద్ద కలకలం .. కారులో తుపాకీ

  • తనిఖీల్లో పట్టుబడ్డ ఒడిశా రిజిస్ట్రేషన్ తో ఉన్న కారు
  • తుపాకీ, రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న భద్రతా సిబ్బంది
  • భువనేశ్వర్ కు చెందిన వ్యక్తి తుపాకీ.. విచారిస్తున్న అధికారులు

తిరుమల అలిపిరి చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా కారులో తుపాకీ దొరికింది. ఈ రోజు ఉదయం తనిఖీలు చేసే క్రమంలో ఒడిశా రిజిస్ట్రేషన్ తో ఉన్న కారును ఆపారు. కారు స్టీరింగ్ వద్ద తుపాకీని దాచి ఉంచారని, ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలు లేవని భద్రతా సిబ్బంది తెలిపారు.

ఇది భువనేశ్వర్ కు చెందిన పానీ అనే వ్యక్తి  తుపాకీ అని, అతనిపై పలు కేసులు ఉన్నట్టు చెప్పారు. తుపాకీతో పాటు రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటిని సీజ్ చేశారు. పానీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

More Telugu News