sai dharam tej: నష్టాలు తెచ్చిన 'ఇంటిలిజెంట్' .. 5 కోట్లు తిరిగిచ్చేసిన వినాయక్!

  • 27 కోట్లతో రూపొందిన 'ఇంటిలిజెంట్' 
  • 20 కోట్ల వరకూ నష్టాలు
  • మరోమారు సాయపడుతోన్న వినాయక్  

సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ 'ఇంటిలిజెంట్' సినిమాను తెరకెక్కించాడు. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చింది. విడుదలైన తొలి రోజునే ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీస్థాయిలో నష్టాలు వచ్చాయి. దాదాపు 27 కోట్లతో సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మించగా 20 కోట్లవరకూ నష్టాలు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగల్చడంతో, కొంతవరకూ వాళ్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో, పారితోషికంగా తాను తీసుకున్న 9 కోట్లలో నుంచి 5 కోట్లను వినాయక్ వెనక్కి ఇచ్చేశారట. గతంలో 'అఖిల్' సినిమా నష్టాలు తెచ్చిపెట్టినప్పుడు కూడా ఆయన తన పారితోషికంలో సగం వెనక్కి ఇచ్చేశారనే విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయన అదే విధంగా సాయపడుతుండటం విశేషం.  

More Telugu News