gold: పెళ్లిళ్ల సీజన్‌ దగ్గరపడుతుండడంతో.. అమాంతం పెరిగిన బంగారం ధర

  • ఈ రోజు పది గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి, రూ.31,650గా నమోదు
  • రూ.720 పెరిగి, రూ.39,970కు చేరిన వెండి ధర
  • గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 0.27 శాతం పెరిగి ఔన్సు 1,354 డాలర్లుగా నమోదు

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం, ఆభరణాల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరిగిపోతుండడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ దగ్గరపడుతుండడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఈ రోజు పది గ్రాముల బంగారం ధర అమాంతం రూ.350 పెరిగి, రూ.31,650గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా పైకి ఎగిసింది. ఈ రోజు కిలో వెండి ధర రూ.720 పెరిగి, రూ.39,970కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగిపోవడమే ఇందుకు కారణం. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 0.27 శాతం పెరిగి ఔన్సు 1,354 డాలర్లకు చేరింది.  

More Telugu News