bellamkonda srinivas: ఆసక్తిని రేపుతోన్న 'సాక్ష్యం' ఫస్టులుక్

  • శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం'
  • శ్రీనివాస్ జోడీగా పూజా హెగ్డే
  • ప్రధాన బలంగా సీనియర్ నటీనటులు  

శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సాక్ష్యం' సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. అభిషేక్ నామా నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

 నాయకా నాయికలు ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ .. మనసులోని ప్రేమను మౌనంగా ఆవిష్కరిస్తున్నట్టుగా ఈ పోస్టర్ వుంది. విదేశీ నేపథ్యంలో ఈ కథ ఎక్కువగా కొనసాగుతుందనే విషయం ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ .. శరత్ కుమార్ .. రవికిషన్ .. మీనా వంటి సీనియర్ నటీనటులు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా కనిపిస్తున్నారు. 'దువ్వాడ జగన్నాథం' సక్సెస్ తరువాత పూజా హెగ్డే, 'జయ జానకి నాయక' హిట్ తరువాత శ్రీనివాస్ చేస్తోన్న సినిమా ఇది. 'సాక్ష్యం'తో ఈ జంటకి హిట్ పడుతుందేమో చూడాలి.    

More Telugu News