Jio: కొత్త సేవలను అందించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న జియో !

  • మార్చి 2018 చివరి నాటికి జియోఫైబర్ సర్వీస్
  • వెల్లడించిన టెలికాం టాక్ రిపోర్ట్
  • ప్రస్తుతం పరీక్షా దశలో సర్వీస్

రిలయన్స్ జియో త్వరలో మార్కెట్లోకి కొత్త సేవలను అందించబోతోంది. తాజాగా టెలికాం టాక్ రిపోర్ట్ ప్రకారం మార్చి 2018 చివరి నాటికి కంపెనీ తన జియో ఫైబర్ సర్వీస్ లను అందిస్తుందని తెలియజేసింది. ప్రస్తుతం జియోఫైబర్ సర్వీస్ పది ముఖ్య పట్టణాలలో ప్రివ్యూ ఆఫర్ క్రింద వినియోగదారులు ప్రతి నెలా 100జీబీ ఉచిత డేటాను పొందుతున్నారు. ప్రస్తుతం పరీక్షా దశలో ఉన్న ఈ సర్వీస్ గురించి ఈ క్వార్టర్ లో కంపెనీ అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

More Telugu News