Chandrababu: కడప, రాజంపేట నేతలతో భేటీ కానున్న చంద్రబాబు

  • ఈ సాయంత్రం పార్టీ నేతలతో భేటీ
  • పార్టీ బలోపేతంపై చర్చ
  • ఈ నియోజకవర్గాల్లో బలంగా ఉన్న వైసీపీ

కడప, రాజంపేట లోక్ సభ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం భేటీ కానున్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంపై చంద్రబాబు దృష్టిని సారించారు. ఇందులో భాగంగానే నేడు ఆయన పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. భేటీ సందర్భంగా పార్టీ పరిస్థితి, ప్రతిపక్ష పార్టీ బలం తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News