fighting: తల్లికి ఎవరు తిండి పెట్టాలని అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

  • మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మరావుపేటలో ఘటన
  • ఇంట్లో శుభకార్యం ముగిసిన తరువాత గొడవపడ్డ అన్నదమ్ములు 
  • తమ్ముడి ప్రాణాలు తీసిన ఇద్దరు అన్నలు

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మరావుపేట లంబాడి తండాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌ల్లిని ఎవ‌రు పోషిస్తార‌నే విష‌యంపై ముగ్గురు అన్న‌ద‌మ్ములు గొడ‌వ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, పోచమ్మ అనే మ‌హిళ త‌న భ‌ర్త చ‌నిపోవ‌డంతో త‌న‌ నలుగురు కుమారులు భూమయ్య, కొమురయ్య, గంగరాజు, సాయికుమార్ ల‌లో ఎవ‌రైనా ఒక‌రి ద‌గ్గ‌ర ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఈ క్ర‌మంలో గంగ‌రాజు ఇంట్లో ఓ శుభకార్యం ఉండ‌డంతో భూమయ్య, సాయికుమార్ వారి తల్లి గంగ‌రాజు ఇంటికి వ‌చ్చారు. నిన్న రాత్రి వారంతా బాగా మ‌ద్యం సేవించి గొడ‌వ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో అన్న గంగరాజు సాయికుమార్‌ను కర్రతో కొడుతుండ‌గా మరో అన్న భూమయ్య.. సాయికుమార్ ను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో రక్తస్రావమై సాయికుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న‌ పోలీసులు గంగరాజు, భూమయ్యల‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జ‌రుపుతున్నారు. 

More Telugu News