aob: ఏవోబీలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు.. కూంబింగ్!

  • మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేసిన భద్రతా బ‌ల‌గాలు 
  • తప్పించుకున్న మావోయిస్టు పార్టీ నాయ‌కులు
  • పోలీసుల కూంబింగ్.. సరిహద్దు గ్రామాల వాసుల్లో భయం

ఇటీవల ఏవోబీలోని క‌టాఫ్ ఏరియా జొడొంబో పంచాయ‌తీ టిక‌ర్‌పాడు అట‌వీ ప్రాంత‌ంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులు నిర్వహించిన శిబిరాన్ని భద్రతా బ‌ల‌గాలు ధ్వంసం చేశాయి. మావోయిస్టు పార్టీకి చెందిన నాయ‌కులు పెద్ద ఎత్తున త‌ప్పించుకోవడంతో వారి కోసం భారీ ఎత్తున బ‌ల‌గాలు రంగంలోకి దిగి కూంబింగ్ చేస్తున్నాయి.

అక్కడి ప‌రిస్థితిని మ‌ల్కాన్‌‌గిరి జిల్లా ఎస్పీ జ‌గ్మోహ‌న్ మీనా, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శ‌ర్మ కలసి స‌మీక్షిస్తున్నారు. హెలీకాప్టర్ ద్వారా బ‌ల‌గాల‌ను స‌రిహద్దు గ్రామాల‌కు త‌ర‌లించారు. అక్కడి గ్రామాల్లోని అన్ని చోట్ల పోలీసులు తిరుగుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజ‌నులు భయాందోళనలకు గురవుతున్నారు. 

More Telugu News