surgical strikes: మరోసారి సర్జికల్‌ స్ట్రయిక్స్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి: పాకిస్థాన్ హెచ్చ‌రిక‌

  • మా భూభాగంలోకి భారత్ అక్రమంగా చొచ్చుకొస్తోంది 
  • అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలి
  • కావాలనే జేఈఎమ్‌ను ఈ దాడిలోకి లాగుతున్నారు

జమ్ము కశ్మీర్‌లోని సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డ ఘ‌ట‌న‌పై భార‌త్ ఆగ్ర‌హంగా ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో భారత్ మ‌రోసారి స‌ర్జికల్‌ స్ట్రయిక్స్ చేస్తుందేమోన‌ని పాక్ కు భయం ప‌ట్టుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. భారత అధికారులు కావాలనే జేఈఎమ్‌ను ఈ దాడిలోకి లాగుతున్నారని చెప్పింది. సరైన విచారణ జరపకుండా బాధ్యతారాహిత్యంతో పాక్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డం సరికాదని చెప్పుకొచ్చింది. అలాగే త‌మ భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొస్తున్న భారత్‌ను అడ్డుకోవాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. 

More Telugu News