nirmala seetha raman: భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.. భారత సైనికులపై దాడిపై పాకిస్థాన్‌కు నిర్మలా సీతారామన్‌ వార్నింగ్!

  • జైషే ఈ మొహమ్మద్ (జేఈఎమ్‌) ఉగ్ర సంస్థే ఈ దాడి చేసింది
  • దుస్సాహసంపై పాకిస్థాన్ మూల్యం చెల్లించుకుంటుంది
  • ఉగ్రదాడిపై ఎవరు చేశారన్న దానిపై ఆధారాలు సంపాదించాం

జమ్మూ కశ్మీర్‌లో సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన జైషే ఈ మొహమ్మద్ (జేఈఎమ్‌) ఉగ్ర సంస్థే ఈ దాడి చేసిందని భారత్ గుర్తించింది. ఈ దాడిపై భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు తెలిపారు. ఈ దుస్సాహసంపై పాకిస్థాన్ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

పాక్ వెనకేసుకొస్తోన్న జేఈఎమ్ ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించిందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రతి దాడులు జరిపిన భారత ఆర్మీ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిందని చెప్పారు. ఈ ఉగ్రదాడి ఎవరు చేశారన్న దానిపై తాము ఇప్పటికే ఆధారాలు సంపాదించామని, పాక్ ప్రభుత్వానికి వాటిని పంపుతామని చెప్పారు.

తాము ఆధారాలు పంపుతున్నప్పటికీ పాక్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, అయినప్పటికీ తాము ఈ సారి కూడా ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ దీటుగా జవాబు ఇస్తూనే ఉందని చెప్పారు. అంతకు ముందు ఆమె జమ్మూలోని మిలటరీ హాస్పిటల్‌కి వెళ్లి సుంజువాన్ ఉగ్రదాడిలో గాయాలపాలైన వారిని కలిశారు. 

  • Loading...

More Telugu News