Pawan Kalyan: జేఎఫ్‌సీ లోగో విడుదల చేసిన పవన్ కల్యాణ్

  • బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిన నేపథ్యంలో జేఎఫ్‌సీ
  • లోగోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన జనసేనాని
  • ఇప్పటికే పలువురితో చర్చలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిన నేపథ్యంలో అన్ని విషయాలపై అధ్యయనం చేయడానికి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్.. సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏపీకి ప్రత్యేక ప్రయోజనాల విషయంలో పోరాటం చేస్తామన్నారు.

ఈ విషయంపై ఇప్పటికే ఆయన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు పలువురితో చర్చలు జరిపారు. నిజాలు నిగ్గు తేల్చుతామని పవన్ అన్నారు.  కాగా, ఈ రోజు ఆయన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ లోగో విడుద‌ల చేశారు. తన ట్విట్ట‌ర్ ఖాతాలో దీన్ని పోస్ట్ చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జేఎఫ్‌సీ అని ఉంది. మీరూ చూడండి..

More Telugu News