manjula: మహేశ్ తో సినిమా చేయాలనుంది .. టైమ్ రావాలి: సోదరి మంజుల

  • డైరెక్షన్ అంత ఈజీ కాదని మహేశ్ చెప్పాడు 
  • ఆ తరువాత నన్ను ఎంకరేజ్ చేశాడు 
  • తనతో సినిమా చేయాలని నాకూ వుంది

మహేశ్ సోదరి మంజుల మొదటిసారిగా మెగాఫోన్ చేతబట్టి, 'మనసుకు నచ్చింది' సినిమా చేశారు. సందీప్ కిషన్ .. అమైరా దస్తూర్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ .. " జీవితంలో చిన్న చిన్న అనుభూతుల్ని ఎలా కోల్పోతున్నాం .. వాటిని ఎలా ఆస్వాదించాలి? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా కొనసాగుతుంది" అని అన్నారు.

 "ప్రకృతి కూడా ఈ సినిమాలో ఒక ప్రధానమైన పాత్రలా కనిపిస్తుంది. లవ్ ..  కామెడీ .. ఎమోషన్స్ ఈ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. డైరెక్షన్ అంత ఈజీ కాదంటూనే మహేశ్ నన్ను ఎంకరేజ్ చేశాడు. మహేశ్ తో ఒక సినిమా చేయాలనే కల అందరి దర్శకులకు ఉంటుంది. అలాగే ఆయనతో ఒక సినిమా చేయాలని  నాకూ వుంది .. అందుకు టైమ్ రావాలి. ఇక మహేశే పిలిచి సినిమా చేద్దాం అంటే అంతకి మించిన అదృష్టం లేదు" అంటూ చెప్పుకొచ్చారు.    

More Telugu News