padmavat movie: రూ.250 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టిన పద్మావత్

  • మూడో వారానికి రూ.254 కోట్ల వసూళ్లు
  • ఈ స్థాయికి చేరిన ఎనిమిదో హిందీ సినిమా
  • అత్యధిక కలెక్షన్ల పరంగా అగ్ర నటులకు తొలి సినిమా

వివాదాస్పద చిత్రం పద్మావత్ ఎట్టకేలకు రూ.250 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.250 కోట్లను మించిపోయాయి. మూడో వారం చివరికి దేశవ్యాప్తంగా చూస్తే నికరంగా ఈ సినిమా ప్రదర్శనల ద్వారా వసూలైన మొత్తం రూ.254 కోట్లు. ఈ స్థాయి వసూళ్లు రాబట్టిన హిందీ సినిమాల్లో పద్మావత్ ఎనిమిదో స్థానంలో ఉంది.

అలాగే, ఈ ముగ్గురు నటీనటులకు తాము నటించిన చిత్రాల్లో ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టిన మొదటి సినిమా ఇదే. జనవరి 25న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, షాహిద్ కపూర్ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం విషయంలో కర్ణిసేన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలకు నోచుకుంది. 

More Telugu News