Jammu And Kashmir: ఉగ్రదాడిలో గాయపడ్డ నిండు గర్భిణి.. పండంటి ఆడబిడ్డ జననం!

  • సుంజ్వాన్ సైనిక స్థావరంపై దాడిలో గాయపడ్డ నిండు గర్భిణి 
  • ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి మిలిటరీ వైద్యులు
  • బిడ్డ దక్కదనుకున్న వైద్యులు
  • ఆడశిశువుకు జన్మనిచ్చిన మహిళ

జమ్మూకశ్మీర్ లోని సుంజ్వాన్ సైనిక స్థావరంపై జైషే మహమ్మద్ ఉగ్ర వాద సంస్థ దాడి జరిపి ముప్పై గంటలు దాటింది. సైనిక కుటుంబాలపై జరిగిన ఈ దాడిలో ఓ నిండు గర్భవతి శరీరంలోకి వెనుక వైపు నుంచి ఓ తూటా దిగింది. దీంతో, ఆమె పరిస్థితి విషమంగా మారడంతో, ఆర్మీ హెలికాప్టర్ ద్వారా ఆమెను మిలిటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఆమె కడుపులోని బిడ్డపై అంతా ఆశలు వదలుకున్నారు. కానీ, వైద్యుల శ్రమ ఫలించడంతో ఆ మహిళ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడశిశువు 2.5 కిలోల బరువు ఉందని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని మిలిటరీ వైద్యులు తెలిపారు.

More Telugu News