kajal: కాజల్ .. నిత్యామీనన్ ఇద్దరూ హఠాత్తుగా తప్పుకోవడమే హాట్ టాపిక్!

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్
  • కాజల్ .. నిత్యామీనన్ ఎంపిక 
  • చివరి క్షణంలో మార్పు

తెలుగు యువ కథానాయకులలో నాని తరువాత ఆ స్థాయి సక్సెస్ రేటు వున్న కథానాయకుడిగా శర్వానంద్ కనిపిస్తాడు. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే .. కొత్తగా అనిపించే కథలను చేయడానికే ఆయన ఆసక్తిని చూపిస్తుంటాడు. అలాంటి శర్వానంద్ తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన డాన్ గా కనిపించనున్నట్టు సమాచారం.

కథాపరంగా ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరం కావడంతో, కాజల్ ను .. నిత్యామీనన్ ను ఎంపిక చేశారు. అయితే ముందుగా ఈ ప్రాజెక్టును అంగీకరించిన ఈ ఇద్దరు కథానాయికలు, హఠాత్తుగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారట. పారితోషికం విషయంలో తేడా రావడమే అందుకు కారణమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిత్యామీనన్ స్థానంలో కల్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్న టీమ్, కాజల్ స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.  

More Telugu News