Kadapa District: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముస్లిం మతపెద్ద దుర్మరణం

  • ఖాజీ సయ్యద్ నజరుల్లా సాహెబ్ మృతి
  • ఆయన భార్యకు గాయాలు
  • ఎడ్లబండిని కారు ఢీకొనడంతో ప్రమాదం

కడప జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దువ్వూరు మండల పరిధిలో గల జాతీయ రహదారిపై జరిగిన ఈ యాక్సిడెంట్ లో ముస్లిం మతపెద్ద ఖాజీ సయ్యద్ నజరుల్లా సాహెబ్ (65) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఆమెను చాగలమర్రిలోని ఓ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఓ ఎడ్లబండిని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సయ్యద్ నజరుల్లా ఉర్దూ లెక్చరర్ గా కూడా పని చేసి రిటైర్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News