Odisha: పార్లమెంటు ఆవరణలో పడిపోయిన ఒడిశా ఎంపీ!

  • బీజేడీకి చెందిన అలజంగి విశ్వనాధస్వామి
  • కుప్పకూలడంతో నుదిటిపై గాయం
  • ఆసుపత్రిలో చేర్చిన ఇతర ఎంపీలు

పార్లమెంటు ఆవరణలో ఒడిశా ఎంపీ అలజంగి విశ్వనాధస్వామి కుప్పకూలడం కలకలం రేపింది. అకస్మాత్తుగా ఆయన కిందపడిపోవడంతో ఆయన తల నేలకు బలంగా తాకింది. దీంతో ఆయన నుదుటిపై గాయమైంది. వెంటనే అప్రమత్తమైన ఎంపీలు ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించి, చికిత్స చేస్తున్నారు. కాగా, స్వామి బిజు జనతాదళ్ పార్టీకి చెందిన నేత. 

More Telugu News