Karimnagar District: మానేరు డ్యాం వద్ద ప్రేమ జంటలే లక్ష్యంగా ఓ వర్గం దాడులు.. నిఘా ఉంచి కాపాడిన పోలీసులు!

  • కరీంనగర్‌లో ఘటన
  • ఐదుగురు ముఠాగా ఏర్పడి క‌ల‌క‌లం
  • మానేరు డ్యాం, పార్క్‌ల వద్ద ప్రేమ జంట‌లే ల‌క్ష్యంగా దాడులు
  • తమ వర్గానికి చెందిన అమ్మాయితో మాట్లాడవద్దని హెచ్చరికలు

కరీంనగర్‌లో ఓ వర్గానికి చెందిన ఐదుగురు ముఠాగా ఏర్పడి క‌ల‌క‌లం రేపుతున్నారు. తమ వర్గానికి చెందిన అమ్మాయిల‌తో ఎవ‌రైనా అబ్బాయిలు మాట్లాడితే చాలు దాడులకు తెగ‌బ‌డుతున్నారు. ప్ర‌ధానంగా నగరశివారులోని మానేరు డ్యాం, పార్క్‌ల వద్ద ప్రేమ జంట‌ల‌ను వారు ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై నిఘా ఉంచిన పోలీసులు ఈ రోజు ఓ ప్రేమ జంట‌ను కాపాడారు.

మానేరు డ్యాంకి ద‌గ్గ‌ర‌లో ఓ ప్రేమజంట ఉంద‌ని తెలుసుకున్న.. యువతి వర్గానికి చెందిన కొందరు ఆమెతో ఉన్న యువ‌కుడిపై దాడికి ప్ర‌యత్నించారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న‌ షీటీం, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు జాయింట్‌ ఆపరేషన్‌తో అత‌డిని కాపాడి, ఈ కేసులో ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News