murder: పావురాల కోసం.. రెండేళ్ల చిన్నారిపై దాడి చేసి చంపేసిన 14 ఏళ్ల అబ్బాయి!

  • క‌ర్ణాట‌క‌లోని రాయ్‌చూర్‌లో ఘటన
  • పంజరంలోని పావురాలను వదిలేసిన రెండేళ్ల వెంకటేశ్
  • విషయం తెలుసుకుని దాడి చేసిన 14 ఏళ్ల బాలుడు

ఓ అబ్బాయి (14) రెండేళ్ల చిన్నారిపై దాడి చేసి, అతడిని చంపేసిన ఘటన క‌ర్ణాట‌క‌లోని రాయ్‌చూర్‌లో కలకలం రేపింది. బసవరాజ్, వెంకమ్మల మూడో కుమారుడయిన‌ వెంకటేశ్ (2) ఇంటికి దగ్గరలో ఆడుకుంటుండగా.. పక్కింటి వద్ద అతడికి ఓ పంజరం కనపడింది. తన స్నేహితులతో కలిసి ఆ పంజరం దగ్గరకు వెళ్లి దానిలోని పావురాలను బయటకు తీసి విడిచిపెట్టాడు. కాసేపటికి తన ఇంటికి వచ్చిన 14 ఏళ్ల అబ్బాయి పంజరంలో పావురాలు లేకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు.

ఆ పావురాలని వెంకటేశే పంజరంలోంచి విడిచి పెట్టుంటాడని భావించి, అతడి ఇంటికి వెళ్లాడు. చివరకు ఆ పావురాలని చిన్నారి వెంకటేశే విడిపి పెట్టాడని నిర్దారించుకున్న ఆ బాలుడు.. అతడిని కిందపడేసి దాడి చేశాడు. దీంతో వెంకటేశ్ సృహ కోల్పోయాడు. ఆ సమయంలో ఆ ఇరు కుటుంబాల వారు ఎవరూ ఇళ్లల్లో లేరు.

 అయితే, పనులు ముగించుకుని వెంకటేశ్ తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి అతడు కిందపడి ఉన్నాడు. వెంకటేశ్ ను ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 14 ఏళ్ల ఆ బాలుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News