akash puri: పూరీ స్టైల్లో ఆసక్తిని రేపుతోన్న 'మెహబూబా' టీజర్

  • యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథ 
  • అంచనాలను పెంచుతోన్న టీజర్  
  • వేసవిలో భారీస్థాయిలో విడుదల  

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'మెహబూబా' సినిమా రూపొందుతోంది. తన తనయుడు ఆకాశ్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఆకాశ్ జోడీగా మంగళూరు అమ్మాయి నేహా శెట్టి ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 1971లో జరిగిన ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలోని ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నిమిషం నిడివి కలిగిన టీజర్ ను రిలీజ్ చేశారు.

 యుద్ధం నేపథ్యంలోని సన్నివేశాలపైనే ఈ టీజర్ ను కట్ చేశారు. ఒక వైపున యుద్ధం కొనసాగుతూ ఉండగానే , మరోవైపున తాను ప్రేమించిన యువతిని రక్షించే ప్రయత్నంలో హీరో వున్నట్టుగా టీజర్లో చూపించారు. టీజర్ ను చూస్తుంటే సినిమాపై ఆసక్తిని .. అంచనాలను పెంచేదిలానే వుంది. సహజత్వం కోసం ఈ సినిమా షూటింగును పంజాబ్ .. హర్యానా .. రాజస్థాన్ లో చిత్రీకరించారు. సందీప్ చౌటా సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, వేసవిలో విడుదల చేయనున్నారు. 

More Telugu News