YSRCP: టీడీపీ ఎంపీల ఆందోళనను ప్రజలు నమ్మరు: ఎమ్మెల్యే రోజా

  • టీడీపీపై రోజా విమర్శలు
  • సీఎం చంద్రబాబు తమ కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలి
  • ప్రజల్లోకి వెళ్లి పోరాడాలి : రోజా డిమాండ్

ఏపీకి అన్యాయం చేశారంటూ కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. సీఎం చంద్రబాబు తమ కేంద్రమంత్రులతో రాజీనామా చేయించి, ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం తమ పార్టీ నాలుగేళ్లుగా పోరాడుతోందని, టీడీపీ కొత్తగా పోరాటాలు చేస్తామంటే వారిని ప్రజలు నమ్మరని అన్నారు.

More Telugu News