school: బాలికల పాఠశాలల్లో పురుష గురువులు వద్దు... పంజాబ్ లో ప్రభుత్వం ప్రతిపాదన

  • విద్యా ప్రయోజనాల పరిరక్షణ కోసమేనని వెల్లడి
  • ప్రజల నుంచి అభిప్రాయాలకు స్వాగతం
  • వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు

బాలికల ప్రభుత్వ పాఠశాలల్లో 50 ఏళ్లలోపు వయసున్న మగ ఉపాధ్యాయులను నియమించొద్దంటూ పంజాబ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీ విధానంలో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యా శాఖ వెబ్ సైట్ లో ఉంచి దానిపై 15 రోజుల్లోపు అభిప్రాయాలు తెలియజేయాలని ప్రజల్ని కోరింది. దీనిపై అక్కడి ప్రభుత్వ టీచర్లు మండిపడ్డారు.

ప్రభుత్వ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్టు ప్రభుత్వ ఉపాధ్యాయుల యూనియన్ ప్రెసిడెంట్ సుఖ్ వీందర్ చాహల్ పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువు వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం తప్పుగా అభివర్ణించారు. అయితే, విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, మానవ వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడం, ఉద్యోగుల్లో బాధ్యతల పట్ల సంతృప్తిని తీసుకొచ్చేందుకే ఈ ప్రతిపాదన చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.

More Telugu News