Vijayawada: కొత్త సర్వీస్... విజయవాడ టూ కడప... విమానం టికెట్ రూ.798!

  • మార్చి 1 నుంచి విమానం సేవలు
  • ఉదయం 8.05కు విజయవాడ నుంచి కడపకు
  • ఉదయం 9.40కి కడప నుంచి విజయవాడకు
  • వెల్లడించిన ట్రూ జెట్

విజయవాడ నుంచి కడపకు నేరుగా విమానాలను నడపాలని ట్రూ జెట్ నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 1వ తేదీ నుంచి కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నామని ప్రారంభ ఆఫర్ గా రూ. 798కే విమాన ప్రయాణం చేయవచ్చని తెలిపింది. ప్రతి రోజూ ఉదయం 8.05 గంటలకు విజయవాడలో బయలుదేరే విమానం కడపకు 9.10కి చేరుతుందని, తిరిగి 9.40కి కడప నుంచి టేకాఫ్ అయి, విజయవాడకు 10.45కు వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.

తాము ఇప్పటికే కడప నుంచి హైదరాబాద్, చెన్నైలకు విమానాలు నడుపుతున్నామని గుర్తు చేసిన సంస్థ, ఇప్పుడు విజయవాడకూ ప్రారంభించామని పేర్కొంది. చిన్న పట్టణాలకు కూడా విమానయానాన్ని దగ్గర చేయాలన్న కేంద్రం ఆలోచనకు అనుగుణంగా తమ సర్వీసులను పెంచుకుంటూ వెళుతున్నామని తెలిపింది.

More Telugu News