IPL: ఐపీఎల్ లో ఏ జట్టుకైతే ఆడాడో.. అదే జట్టుకు కోచ్ గా మారిన మలింగ!

  • ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్
  • ముంబై ఇండియన్స్ తరపున 110 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన మలింగ
  • ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ గా షేన్ బాండ్ తో పాటు కొనసాగనున్న మలింగ

శ్రీలంక యార్కర్ స్పెషలిస్టు పేసర్ లసిత్ మలింగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఏ జట్టుకైతే ప్రాతినిధ్యం వహించాడో అదే జట్టుకు బౌలింగ్ కోచ్ గా మారాడు. జనవరిలో జరిగిన ఐపీఎల్ సీజన్ 11 వేలంలో మలింగను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో లంకేయుల దిగ్గజ బౌలర్ అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. ఈ నేపథ్యంలో తమ జట్టు విజయాల్లో భాగమై 110 మ్యాచ్ లు ఆడిన మలింగను ముంబై ఇండియన్స్ యాజమాన్యం బౌలింగ్ కోచ్ గా నియమించింది.

 కాగా, ముంబై ఇండియన్స్ జట్టుకు హెచ్ కోచ్‌ గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం జయవర్ధనే వ్యవహరిస్తుండగా, బౌలింగ్‌ కోచ్‌ గా కివీస్ కు చెందిన షేన్ బాండ్ ఉన్నాడు. వీరితో కలిసి మలింగ కూడా కోచ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. దీనిపై మలింగ మాట్లాడుతూ, ముంబై ఇండియన్స్‌ జట్టుతో కొనసాగడం గొప్ప అవకాశమని అన్నాడు. ముంబై గత దశాబ్దంగా తన సొంత జట్టని చెప్పాడు. ఇంతకాలం ఆటగాడిగా ఉన్న తాను ఇప్పుడు కోచ్‌ గా రావడం ఆనందంగా ఉందని చెప్పాడు. 

More Telugu News