Hyderabad: ఆ పని చేసుంటే కొడుకు, కోడలు నాకు వద్దేవద్దు: గ్రహణ బలిచ్చిన రాజశేఖర్ తల్లి

  • పోలీసులు నా కొడుకును తీవ్రంగా హింసిస్తున్నారు
  • చెయ్యని నేరాన్ని చేశానని చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు
  • పోలీసులపై రాజశేఖర్ తల్లి ఆరోపణలు

తన కుమారుడు ఓ చిన్నారిని తెచ్చి బలిచ్చాడంటే నమ్మబోమని, పోలీసులు తీవ్రంగా కొట్టి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని గ్రహణ బలి ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ తల్లి ఆరోపించింది. ఒకవేళ ఆ బలి తన కుమారుడే ఇచ్చుంటే, అతను, తన కోడలు కూడా అక్కర్లేదని అమె చెప్పింది. ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, తన ఇంట్లో ఎటువంటి పూజలు జరగలేదని స్పష్టం చేసింది.

పోలీసులు తనను కూడా ప్రశ్నించారని, ఈ బలి తామివ్వలేదనే చెప్పామని, తాము చేశామని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పింది. తన కుమారుడికి పిల్లలు లేకపోవడంతో వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలకు వెళ్లి వస్తాడని, ఎన్నడూ క్షుద్రపూజలు చేయలేదని అన్నారు. పోలీసులు తన కుమారుడిని బాగా కొడుతున్నారని, చెయ్యని నేరాన్ని చేసినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News