ఆసుపత్రికి తరలించగా కాల్పులు.. తప్పించుకు పారిపోయిన పాకిస్థాన్ ఖైదీ

షార్ట్స్‌లో చూడండి
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని శ్రీ మహారాజా హరిసింగ్ ఆసుపత్రి వద్ద క‌ల‌క‌లం చెల‌రేగింది. వైద్య ప‌రీక్ష‌ల కోసం పాకిస్థాన్ ఖైదీ న‌వీద్‌తో పాటు ప‌లువురు ఖైదీల‌ను ఆ ఆసుప‌త్రికి తీసుకురాగా.. ఆసుప‌త్రి వెలుపల ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు.

అంతేగాక‌, ఆ స‌మ‌యంలో ఖైదీ న‌వీద్ కూడా పోలీసుల నుంచి ఓ తుపాకీ లాక్కొని కాల్పుల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో తీవ్ర‌గాయాల‌పాలైన ఓ పోలీసు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మ‌రొక పోలీసులు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కాల్పుల స‌మ‌యంలో పాకిస్థాన్ ఖైదీ న‌వీద్ త‌ప్పించుకు పారిపోయాడ‌ని, గాలింపు కొన‌సాగుతోంద‌ని శ్రీన‌గ‌ర్ పోలీసులు మీడియాకు తెలిపారు.      
Go Back to Shorts
Pakistan
terrorists
fire

More Telugu News