murder: మరో ఘటన... ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఇల్లాలు!

  • కడప జిల్లాలోని చక్రాయిపేట మండలం, కల్లూరుపల్లిలో కలకలం
  • భర్తను చంపి యాక్సిడెంట్‌గా చిత్రీకరించిన వైనం
  • ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

ప్రియుడితో కలిసి భార్య తన భర్తను హతమార్చిన మరో సంఘటన ఇది. కడప జిల్లాలోని చక్రాయిపేట మండలం, కల్లూరుపల్లిలో చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. ఆ గ్రామంలో నివసించే శంకర్‌నాయక్‌, మహేశ్వర్‌ రెడ్డి మంచి మిత్రులు. అయితే, మహేశ్వర్ రెడ్డి బుద్ధి వక్రమార్గంలో పయనించింది. శంకర్ నాయక్ భార్య శైలజతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం గుర్తించిన శంకర్ నాయక్ తన భార్య శైలజను హెచ్చరించాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న శైలజ, మహేశ్వర్ రెడ్డి కలసి అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ వెంటనే అతడిని చంపేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు శైలజ, మహేశ్వర్ రెడ్డిలే నిందితులని తేల్చారు. వారిని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

More Telugu News