gujarat woman: భారతీయ మహిళను ఐసిస్ కు సెక్స్ బానిసగా అమ్మే ప్రయత్నం చేసిన భర్త!

  • ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు
  • పెళ్లి కోసం మతం కూడా మార్పించాడు
  • చివరకు సెక్స్ బానిసగా అమ్మే ప్రయత్నం చేశాడు

ఓ మహిళను టెర్రరిస్ట్ సంస్థ ఐసిస్ కు అమ్మేందుకు ఆమె భర్త యత్నించిన విషయం వెలుగు చూసింది. భర్త రియాజ్ మొహమ్మద్ ది కేరళలోని కొచ్చి. అతని భార్య గుజరాత్ లోని జామ్ నగర్ లో జన్మించింది. తన తండ్రి ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత ఆమె కుటుంబం అంతా కేరళకు షిఫ్ట్ అయ్యారు.

ఒకే కాలేజీలో చదువుకుంటున్న తరుణంలో 2014లో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలను చూపి, భయపెట్టి ఇస్లాం మతంలోకి మారాలని, తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఈ నేపథ్యంలో, వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు.

మొహమ్మద్ రియాజ్ తల్లిదండ్రులు సౌదీఅరేబియాలోని జెద్దాలో ఉంటారు. పెళ్లి అయిన తర్వాత తన భార్యను తీసుకుని జెద్దా వెళ్లాడు రియాజ్. అనంతరం సిరియాలో ఆమెను ఐసిస్ కు సెక్స్ బానిసగా అమ్మేందుకు యత్నించాడు. అయితే, సరైన సమయంలో విషయాన్ని పసిగట్టిన బాధితురాలు... జరుగుతున్న విషయం గురించి తన తల్లిదండ్రులకు తెలియజేయగలిగింది.

ఈ ఘటనకు సంబంధించి కొచ్చిలోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరోవైపు, ఎన్ఐఏ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో, నిన్న చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన రియాజ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు, తనపై తన భార్య చేసిన ఆరోపణలను రియాజ్ ఖండించాడు. ఆమె తల్లిందండ్రులు ఆడించినట్టు ఆమె ఆడుతోందని చెప్పాడు.

More Telugu News