bonus: ఒక్కో ఉద్యోగికి కనీసం రూ. 3.50 లక్షల చొప్పున బోనస్ ఇచ్చిన చైనా కంపెనీ!

  • భారీ బోనస్ ఇచ్చిన చైనా సంస్థ
  • ప్రతి ఉద్యోగికి కనీసం రూ. 3.50 లక్షల కమిషన్
  • 60 ఏళ్లు దాటిన ఉద్యోగులకు కూడా బోనస్

తన ఉద్యోగులకు ఏకంగా రూ. 163 కోట్ల బోనస్ ను చైనాకు చెందిన 'ఫంగ్డా స్పెషల్ స్టీల్ టెక్నాలజీ' సంస్థ అందజేసింది. ఈ మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చింది. ఈ సంస్థలో దాదాపు 5 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రతి ఏడాది ఈ కంపెనీ టర్నోవర్ రూ. 80 వేల కోట్లకు పైగా ఉంటోంది. తాజాగా సంస్థలోని ప్రతి ఉద్యోగికీ కనీసం రూ. 3.50 లక్షల బోనస్ అందింది. 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న ఉద్యోగులకు కూడా బోనస్ అందడం విశేషం.  

More Telugu News