Mahesh Babu: 'భరత్ అనే నేను'లో మార్పులు .. చేర్పులు?

  • షూటింగు దశలో 'భరత్ అనే నేను' 
  • కొన్ని మార్పులు అవసరమని భావిస్తోన్న కొరటాల 
  • ఆ దిశగా కొనసాగుతోన్న ప్రయత్నాలు

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం చాలాకాలం క్రితమే కొరటాల పకడ్బందీగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఒక సినిమాకు .. ఈ కథకు అక్కడక్కడా పోలికలు వున్నట్టుగా గుసగుసలు వినిపిస్తూ ఉండటంతో, మార్పులు .. చేర్పులకు కొరటాల సిద్ధమైపోయారట. ఇంతవరకూ చేసిన సన్నివేశాలు .. ఇక ముందు చేయవలసిన వాటి విషయంపై ఆయన మహేశ్ బాబుతో చర్చించినట్టు సమాచారం.

అంతేకాదు, ఈ చర్చల కోసం ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ను కూడా పిలిపించారట. ఆయనతో కలిసి కూర్చుని చేయవలసిన మార్పులు .. చేర్పులను ఖరారు చేసుకున్నారట. ఈ సినిమా కథా వస్తువు గురించి వస్తోన్న కామెంట్ల వలన .. ఆల్రెడీ మహేశ్ సినిమాలు రెండు బాగా దెబ్బతిని ఉండటం వలన, 'భరత్ అనే నేను' విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానీ నటిస్తోన్న సంగతి తెలిసిందే.   

More Telugu News