south africe: తొలి వికెట్ కోల్పోయిన భారత జట్టు

  • రబడా బౌలింగ్ లో ఓపెనర్ ఆర్జీ శర్మ అవుట్
  • విజయలక్ష్యానికి చేరువగా టీమిండియా
  • క్రీజ్ లో శిఖర్ థావన్ - కోహ్లీ

సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రబడా బౌలింగ్ లో 3.5 ఓవర్ లో ఓపెనర్ ఆర్జీ శర్మ (26) అవుటయ్యాడు. రబడా వేసిన బంతిని కొట్టిన ఆర్జీ శర్మ.. మోర్కెల్ కు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజ్ లో థావన్, విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు.కాగా, స్వల్ప విజయలక్ష్యంతో బరిలో కి దిగిగన టీమిండియా, ఆ లక్ష్యాన్ని ఛేదించనుంది. 13.2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 82/1.

More Telugu News