mumbai: ప్రాణాలు తీసిన 'ఒక్క రూపాయి' గొడవ

  • చిన్న విషయంలో గొడవపడి దాడికి పాల్పడ్డ వైనం
  • షాపులో కోడిగుడ్లు కొనుక్కున్న మనోహర్ గమ్నే (54)
  • రూపాయి తక్కువగా ఉండడంతో మొదలైన గొడవ
  • ముంబైలోని థానేలో ఘటన

ముంబైలోని థానేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక్క రూపాయి కోసం గొడవ పడి మనోహర్ గమ్నే (54) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన తమ ఇంటికి దగ్గరలోని ఓ దుకాణానికి వెళ్లి, కోడిగుడ్లు కొనుక్కున్నాడు. అయితే, మనోహర్ దగ్గర కోడిగుడ్లకు కావాల్సిన ధరలో ఒక్క రూపాయి తక్కువ ఉండడంతో షాపు ఓనర్‌తో ఆయనకు గొడవైంది. ఈ విషయంపై వారిద్దరు దుర్భాషలాడుకున్నారు. ఈ వివాదం మరింత చెలరేగడంతో  షాపు యజమాని కొడుకు మనోహర్ గమ్నేపై పిడిగుద్దులు కురిపించడంతో ఆయన అక్కడిక్కడకే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  

More Telugu News