Tollywood: లక్ష్మీదేవి కనకాలకు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ .. కన్నీళ్లు పెట్టుకున్న తారక్!

  • లక్ష్మీదేవి భౌతికకాయాన్ని సందర్శించిన జూనియర్ ఎన్టీఆర్
  • దేవదాస్ కనకాల, రాజీవ్ కనకాలకు పరామర్శ
  • నివాళులర్పించిన సినీ, టీవీ నటులు

ప్రముఖ సీనియర్ నటి, నట శిక్షకురాలు లక్ష్మీదేవి కనకాల మృతదేహాన్ని జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ మణికొండలోని నివాసంలో ఉన్న లక్ష్మీదేవి భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. దేవదాస్ కనకాల, రాజీవ్ కనకాలను, వారి కుటుంబసభ్యులను జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు. కాగా, మా ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా, సినీ నటులు శ్రీకాంత్, శివబాలాజీ, టీవీ నటులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.  

More Telugu News