Rajasthan: పక్షవాతంతో మంచం పట్టిన తల్లిని లేపి.. చిత్రహింసలు పెట్టిన తనయుడు.. వీడియో వైరల్‌

  • ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తోన్న నిందితుడు జోగేంద్ర చౌదరి 
  • వీడియో తీసిన నిందితుడి మేనల్లుడు
  • పరారీలో జోగేంద్ర 
  • రాజస్థాన్‌లోని షాజ్‌హాన్‌పూర్‌లో ఘటన

నవమాసాలు మోసి, కని, పెంచి కుమారుడిని ప్రయోజకుడిని చేసిందో ఓ తల్లి. వృద్ధాప్యంలో తన కుమారుడు తనను కంటికి రెప్పలా చూసుకుంటాడనుకుంది. కానీ ఆ కుమారుడి చేతిలోనే చిత్రహింసలకు గురై చనిపోతానని ఆమె ఊహించలేదు. రాజస్థాన్‌లోని షాజ్‌హాన్‌పూర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పక్షవాతంతో మంచం పట్టిన 82 ఏళ్ల తన తల్లిని లేపి.. చిత్రహింసలు పెట్టాడో పుత్రరత్నం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

తల్లిని హింసించిన ఆ కసాయిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. ఈ వీడియో బయటకు రావడంతో నిందితుడి ఇంటికి వెళ్లి విచారణ జరిపామని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని అన్నారు. ఈ వీడియోను నిందితుడి మేనల్లుడు తీశాడని గుర్తించినట్లు చెప్పారు. నిందితుడి పేరు జోగేంద్ర చౌదరి అని, అతడు ఓ స్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని తెలిపారు. తల్లిపై ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.   

  • Loading...

More Telugu News