సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ ను ప్రకటించిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా
- ‘సుప్రీం’లో ఈ నెల 5 నుంచి కొత్త కేసుల విచారణ
- రోస్టర్ ను బయటకు ప్రకటించడం ఇదే తొలిసారి
- సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో రోస్టర్ కు సంబంధించిన పూర్తి వివరాలు
అవసరమైన సమయంలో రాజ్యాంగ బెంచ్, ప్రత్యేక విచారణల నిమిత్తం విచారణ కమిషన్ నూ ఏర్పాటు చేస్తారు. కేవలం, కొత్త కేసులకు మాత్రమే ఈ రోస్టర్ కు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో పొందుపరిచారు. కాగా, సుప్రీం కోర్టులో సీనియర్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్ కార్మిక, పరోక్షపన్నులు, నేర సంబంధిత అంశాలు, వినియోగదారుల రక్షణ కేసులను విచారిస్తారు.