Mahesh Babu: మహేశ్ తో సందీప్ రెడ్డి వంగా 'షుగర్ ఫ్యాక్టరీ' ఖాయమైనట్టే!

  • మహేశ్ కి కథ వినిపించిన సందీప్ రెడ్డి వంగా 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేశ్ బాబు 
  • వచ్చే ఏడాది వేసవిలో మొదలయ్యే అవకాశం

'అర్జున్ రెడ్డి' సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదుపరి సినిమా ఏమిటనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన మహేశ్ బాబుకి 'షుగర్ ఫ్యాక్టరీ' అనే కథ వినిపించి మెప్పించాడనే టాక్ వచ్చింది. అయితే ఇందులో వాస్తవమెంతనే విషయమే అందరినీ ఆలోచనలో పడేసింది.

సందీప్ రెడ్డి వంగాతో ఈ సినిమా చేయడానికి మహేశ్ అంగీకరించాడనీ, తన 26వ సినిమాగా చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమాను విజయ్ దేవరకొండతోనే చేయాలని సందీప్ రెడ్డి అనుకున్నాడట. మహేశ్ ఓకే చెప్పడంతో ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మారుస్తున్నాడని అంటున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావొచ్చని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.  

More Telugu News