ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్ఠానం పిలుపు.. ముఖ్య నేతలతో నేడు అమిత్ షా భేటీ!
- ఇరు రాష్ట్రాల నాయకులతో నేడు అమిత్ షా వేర్వేరుగా చర్చలు
- పొత్తులు, సీట్ల పెంపు తదితర వాటిపై చర్చ
- ఢిల్లీకి పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు
ఏపీలో ప్రస్తుతం మిత్రపార్టీ టీడీపీతో వైరం, అసెంబ్లీ సీట్ల పెంపు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సీట్ల పెంపును తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అధికార టీఆర్ఎస్కు మేలు జరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఏపీలో విభజన సమస్యలు, బీజేపీ-టీడీపీపై ఇటీవల చోటుచేసుకున్న మనస్పర్థలు, పార్టీలో గ్రూపులు తదితర వాటిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. టీడీపీతో సంబంధాల విషయంలో ఏపీలో బీజేపీ రెండు వర్గాలుగా మారిన నేపథ్యంలో సమస్య పరిష్కారంపై అమిత్ షా సూచనలు చేస్తారని తెలుస్తోంది.