vijay yesudas: హీరోగా తెరంగేట్రం చేసిన గాయ‌కుడు విజ‌య్ యేసుదాసు... ట్రైల‌ర్ విడుద‌ల‌

  • ప‌డైవీర‌న్ అనే మ‌ల‌యాళ సినిమాతో ఎంట్రీ
  • ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌ల‌
  • కీల‌కపాత్ర‌ పోషించిన డైరెక్ట‌ర్ భార‌తీ రాజా

ప్ర‌ముఖ గాయ‌కుడు విజ‌య్ యేసుదాసు హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం 'ప‌డైవీర‌న్‌'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌లైంది. ఫిబ్ర‌వ‌రి 2న ఈ చిత్రం విడుద‌ల‌కాబోతోంది. ఇందులో విజ‌య్ ఓ పోకిరి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ఈ చిత్రంలో ద‌ర్శ‌కుడు భార‌తీ రాజా ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. హీరోయిన్‌గా అమృత న‌టిస్తోంది. కార్తీక్ రాజా సంగీతం స‌మ‌కూర్చ‌గా, ధ‌నా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విజ‌య్ యేసుదాసు చాలా హిట్ పాట‌లు పాడారు. అల‌నాటి గాయ‌కుడు కేజే యేసుదాసు కుమారుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ప్ప‌టికీ త‌నకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. ట్రైల‌ర్ చూస్తే న‌టుడిగా కూడా విజ‌య్ ఆక‌ట్టుకుంటాడ‌నే న‌మ్మకం క‌లుగుతోంది. ట్రైల‌ర్ చూసిన న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు.

More Telugu News