Bollywood: హిందీలో రీమేక్ అవ‌బోతున్న కాంచ‌న 2... హీరోగా అక్ష‌య్ కుమార్‌

  • 'కాంచ‌న' సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన 'కాంచ‌న 2'
  • రాఘ‌వ లారెన్స్‌, తాప్సీ, నిత్యా మీన‌న్ న‌టించిన సినిమా
  • తెలుగులో 'గంగ' పేరుతో విడుద‌లైన చిత్రం

2015లో వ‌చ్చిన 'కాంచ‌న 2' చిత్రాన్ని త్వ‌ర‌లో బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా అక్ష‌య్ కుమార్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 'కాంచ‌న' సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ సినిమా తెలుగులో 'గంగ' పేరుతో విడుద‌లైంది. ఇందులో రాఘ‌వ లారెన్స్‌, తాప్సీ, నిత్యామీన‌న్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. దీనికి ముందు వ‌చ్చిన 'కాంచ‌న' చిత్రం పెద్ద హిట్ కావ‌డంతో లారెన్స్ 'కాంచన 2' తీశారు. ఈ సినిమా తెలుగు, తమిళంతో కలిపి దాదాపు రూ.120 కోట్ల వసూళ్లు రాబట్ట‌డంతో 'కాంచ‌న 3' సినిమాను కూడా తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డారు లారెన్స్‌. ఇందులో త‌మిళ బిగ్‌బాస్ ఫేం ఓవియా హెలెన్ న‌టిస్తోంది.

ఇక 'కాంచ‌న 2' రీమేక్ విష‌యానికొస్తే... క్రిఅర్జ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ప్రేరణా అరోరా, అర్జున్‌ కపూర్‌ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్‌లో సినిమా చిత్రీకరణ మొద‌లు పెట్టి, 2019లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రోవైపు అక్షయ్ కుమార్‌ నటించిన ‘ప్యాడ్‌మ్యాన్‌’ చిత్రం ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News