Andhra Pradesh: ఫిబ్రవరి 2న ఏపీ మంత్రి మండలి సమావేశం

  • ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రకటన విడుదల
  • ఫిబ్రవరి 1లోగా అన్ని శాఖల కార్యదర్శులు తమ ఎజెండా అంశాలను పంపాలి
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

ఏపీ మంత్రి మండలి సమావేశం ఫిబ్రవరి 2న జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతిలోని ఏపీ సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని అన్నారు. అన్ని శాఖల కార్యదర్శులు తమ ఎజెండా అంశాలను ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 3 గంటల లోపల సాధారణ పరిపాలనా శాఖకు పంపించాలని కోరారు.

  • Loading...

More Telugu News