Tollywood: ‘ఈ గాయత్రీపటేల్ ప్రతి పేజీ క్రైమ్ పేజీరా..’: ‘గాయత్రి’ ట్రైలర్ లో మోహన్ బాబు

  • హైదరాబాద్ లో ‘గాయత్రి’ ఆడియో వేడుక
  • ఈ సినిమా ట్రైలర్ విడుదల
  • ఈ వేడుకకు హాజరైన పలువురు సినీ ప్రముఖులు

శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు తాను హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘గాయత్రి’. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కుటుంబం, టి.సుబ్బరామిరెడ్డి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, నటి శ్రియ, యాంకర్ అనసూయ, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ‘గాయత్రి’ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ‘ఇంతైనా పశ్చాత్తాపం లేని ఈ ముద్దాయిని.. నేరస్తుడిగా పరిగణించి.. ఉరిశిక్ష విధించడమైనది’ అని కోట శ్రీనివాసరావు చెప్పే వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ‘తమరంటే భయం నటిద్దామని’,‘అది వదిలే రకం కాదు..నేను దొరికే రకం కాదు’, ‘ఈ గాయత్రీపటేల్ ప్రతి పేజీ క్రైమ్ పేజీరా..’ అంటూ మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ తో, యాక్షన్ సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. కాగా, ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘గాయత్రి’లో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు.

More Telugu News