Chandrababu: రెండు ఏజెన్సీలతో చంద్రబాబునాయుడి ఎన్నికల సర్వే.. ఏం తేలిందంటే!

  • 2014 కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకోనున్న టీడీపీ
  • 140 నుంచి 145 సీట్లు
  • రాయలసీమలో మరింత బలపడ్డ టీడీపీ

తదుపరి ఎన్నికలు సకాలంలోనే జరుగుతాయా? లేక ముందస్తు ఎన్నికలు వస్తాయా? అనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ... ఎన్నికల వేడి మాత్రం అప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వే చేయించినట్టు సమాచారం. ఇందులో పలు ఆసక్తికర విషయాలు తేలాయి.

సర్వే ఫలితాలు ఇవే...

  • 2014 కంటే ఎక్కువ సీట్లను టీడీపీ కైవసం చేసుకుంటుంది.
  • టీడీపీకి 140 నుంచి 145 వరకు సీట్లు వస్తాయి.
  • రాయలసీమలో టీడీపీ మరింత బలం పుంజుకుంది.
  • 2014 కంటే ఎక్కువ సీట్లు రాయలసీమలో వస్తాయి.
  • కడప, కర్నూలు జిల్లాల్లో కీలక వైసీపీ నేతలు చేరడంతో బలపడ్డ టీడీపీ.
  • రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉండే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కొంచెం బలహీనంగా ఉంది.
  • నెల్లూరు జిల్లాలో టీడీపీ కొంచెం వెనుకబడి ఉంది.
  • కాపు రిజర్వేషన్లకు చంద్రబాబు అనుకూలంగా ఉండటంతో... తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురు లేదు.  
  • పెన్షన్లు, రేషన్ సరకుల పంపిణీపై మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.
  • ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నా... కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు నిరాశాజనకంగా ఉంది.

More Telugu News