Pawan Kalyan: సావిత్రి, ఎస్వీఆర్‌కి కూడా ప‌ద్మ పుర‌స్కారాలు ఇవ్వాలి: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌లంద‌రికీ శుభాకాంక్షలు 
  • అవార్డులు అందుకున్న వారిలో తెలుగువారు ఇంకా ఉండి ఉంటే బాగుండేది
  • ఆ దిశ‌గా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి

ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌లంద‌రికీ త‌న త‌ర‌ఫున‌, జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌ త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప్రధానంగా సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాకి, ఏపీ నుంచి అవార్డు అందుకున్న కిడాంబి శ్రీకాంత్‌కి అభినందనలు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు. ప‌ద్మ అవార్డులు అందుకున్న వారిలో తెలుగువారు ఇంకా ఉండి ఉంటే బాగుండేద‌ని త‌న‌కు అనిపించింద‌ని చెప్పారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో తమ కార్యకర్తలతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ... 'తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల‌కు నా విన్న‌పం ఏంటంటే, మున్ముందు ప‌ద్మ పుర‌స్కారాల్లో అల‌నాటి న‌టులు సావిత్రి, ఎస్వీఆర్‌కి ప‌ద్మ అవార్డులు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదిస్తే బాగుంటుంది, ఆ దిశ‌గా ఆలోచించాల‌ని కోరుకుంటున్నాను' అని  వ్యాఖ్యానించారు.      

More Telugu News