41 Dead: సియోల్‌లోని ఓ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవ దహనం

  • మరో 80 మందికి గాయాలు
  • క్షతగాత్రులను మరో ఆసుపత్రికి తరలించిన రెస్క్యూ సిబ్బంది
  • అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆసుపత్రిలో సుమారు 200 మంది

దక్షిణకొరియా రాజధాని సియోల్‌లోని సెజాంగ్‌ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలుకోల్పోగా, మరో 80 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. ఆసుపత్రిలోని మొదటి, రెండవ అంతస్తుల్లో ఉన్న వారే బాధితుల్లో అధికమంది ఉన్నారని అక్కడి అధికారులు చెప్పారు. గాయాలపాలయిన వారిని రెస్క్యూ సిబ్బంది మరో ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆ ఆసుపత్రిలో సుమారు 200 మంది ఉన్నారని అక్కడి అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదం జరుగుతోందని అరుస్తూ, ఓ నర్సు అందరినీ అలెర్ట్ చేయడంతో కొంతమంది అత్యవసర ద్వారాల ద్వారా బయటకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. నెల రోజుల క్రితం దక్షిణకొరియాలోని ఓ ఫిట్‌నెస్ క్లబ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 29 మంది మృతి చెందిన ఘటన మరవక ముందే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 

  • Loading...

More Telugu News