Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. టికెట్ తీసుకోలేదని ప్రయాణికుడి చేతిని విరగ్గొట్టిన డ్రైవర్, కండక్టర్!

  • ఎల్బీనగర్‌లో ఘటన
  • కండక్టర్‌తో గొడవ పెట్టుకున్న ప్రయాణికుడు
  • ప్రయాణికుడిపై కర్రలతో దాడి చేసిన కండక్టర్, డ్రైవర్

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తోన్న ప్రయాణికుడిపై డ్రైవర్, కండక్టర్ దాడి చేసి అతడి చేతిని విరగ్గొట్టారు. సదరు ప్రయాణికుడు బస్ ఎక్కి టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్నాడు. ఈ విషయంపై ఆ బస్సు కండక్టర్‌కి, ప్రయాణికుడికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కండక్టర్, బస్సు డ్రైవర్ కలిసి ప్రయాణికుడిని కిందికి దించారు. అనంతరం కర్రలతో ప్రయాణికుడిపై దాడి చేశారు. కాగా, ఈ విషయంపై సదరు ప్రయాణికుడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News