Raviteja: ఆసక్తిని రేపుతోన్న 'టచ్ చేసి చూడు' ట్రైలర్

  • విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' 
  • యాక్షన్ కామెడీ నేపథ్యం
  • వచ్చేనెల 2వ తేదీన రిలీజ్ 

రవితేజ కథానాయకుడిగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' సినిమా తెరకెక్కింది. రాశిఖన్నా, శీరత్ కపూర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా నుంచి, కొంత సేపటి క్రితమే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. కామెడీ .. యాక్షన్ .. చేజింగ్స్ తో కూడిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

 "యూనిఫామ్ లో వుంటే గన్ లో ఆరే బుల్లెట్లు .. యూనిఫామ్ తీసేస్తే దానమ్మ .. రాయితో చంపుతానో .. రాడ్ తో చంపుతానో నాకే తెలియదు" అంటూ ఓ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ చెప్పిన డైలాగ్ బులెట్ లా పేలింది. మొత్తంగా చూస్తే ఈ సినిమాపై ఆసక్తిని .. అంచనాలను పెంచేదిగానే ఈ ట్రైలర్ వుంది. వచ్చే నెల 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • Loading...

More Telugu News