rajasekhar: రెండు ప్రాజెక్టులు సెట్ చేసిన రాజశేఖర్

  • గోపీ దర్శకత్వంలో రాజశేఖర్ 
  • కన్నడ దర్శకుడితో మరో సినిమా 
  • లైన్లో మూడో ప్రాజెక్టు    

చాలాకాలం తరువాత 'గరుడ వేగ' సినిమాతో రాజశేఖర్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత ఆయన ఏ ప్రాజెక్టులను ఎవరితో చేయనున్నారనే వార్తలు బయటికి రాలేదు. కానీ సైలెంట్ గా ఆయన రెండు ప్రాజెక్టులను సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక సినిమాను 'గరుడ వేగ'ను నిర్మించిన బ్యానర్లోనే చేస్తారట. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన గోపీ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు సమాచారం.

ఇక మరో సినిమాను కన్నడ దర్శకుడు నాగశేఖర్ తో చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ఓ యంగ్ హీరో చేయనుండగా .. కథానాయికగా రాజశేఖర్ కూతురు శివాని చేస్తుందట. కీలకమైన పాత్రలో రాజశేఖర్ కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన పాత్ర ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందని చెబుతున్నారు. ఇక మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టే పనిలో రాజశేఖర్ వున్నాడని అంటున్నారు.   

More Telugu News